యాప్నగరం

కర్నూలు టీడీపీలో టిక్కెట్ లొల్లి.. లోకేష్ ప్రకటనపై స్పందించిన ఎస్వీ, టీజీ

కర్నూలు టిక్కెట్‌పై టీడీపీలో దుమారం రేగింది. రెండు రోజుల క్రితం మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలతో నేతల మధ్య డైలాగ్ వార్ మొదలయ్యింది. పక్కా సీటు నాదేనని సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ అంటుంటే.. లోకేష్‌ కాదు చంద్రబాబు నిర్ణయమే ఫైనలంటున్నారు ఎంపీ టీజీ వెంకటేష్.

Samayam Telugu 11 Jul 2018, 3:47 pm
కర్నూలు టిక్కెట్‌పై టీడీపీలో దుమారం రేగింది. రెండు రోజుల క్రితం మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలతో నేతల మధ్య డైలాగ్ వార్ మొదలయ్యింది. పక్కా సీటు నాదేనని సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ అంటుంటే.. లోకేష్‌ కాదు చంద్రబాబు నిర్ణయమే ఫైనలంటున్నారు ఎంపీ టీజీ వెంకటేష్. మంత్రి వ్యాఖ్యలపై ఎస్వీ మోహన్ రెడ్డి స్పందించారు. పరిస్థితులను చూసే లోకేష్ అభ్యర్థుల్ని ప్రకటించేశారని.. ఇదే ఫైనల్ అన్నారు. టీజీ వెంకటేష్, భరత్‌లతో తనకు విభేదాలేవని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. త్వరలోనే వారిని కలిసి మద్దతు కూడా కోరతానని చెప్పారు.
Samayam Telugu Kurnool


ఇదిలా ఉంటే టీజీ వెంకటేష్ కూడా లోకేష్ వ్యాఖ్యలపై స్పందించారు. మంత్రి ప్రకటన తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ఎంపీ అన్నారు. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని.. ఎప్పుడైనా బీఫామ్ ఇచ్చే ముందు కాని ప్రకటన చేస్తారన్నారు. అయితే లోకేష్ ముందే ఎందుకు ప్రకటించారో అర్థంకాలేదన్నారు. ఆయన్ను ఎస్వీ మోహన్ రెడ్డి హిప్నటైజ్ చేశారని అనుకుంటానన్నారు టీజీ.

మొత్తానికి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు కర్నూలు టీడీపీ నేతల మధ్య పంచాయితీ మొదలయ్యింది. ఎవరికివారే ఈ సీటుపై ధీమాతో ఉండటంతో కేడర్ కూడా గందరగోళంలో ఉన్నారు. లోకేష్ పర్యటనలో కూడా రెండు వర్గాల నేతలు పోటీపడి మరీ ఏర్పాట్లు చేశారు. మరి చినబాబు మాటే ఫైనలా.. లేక చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారా అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
చదవండి: కర్నూలు టీడీపీ అభ్యర్థుల్ని ఖరారు చేసిన లోకేష్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.