తునిలో జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ అమలాపురం పోలీస్ స్టేషన్ ముందు ఉదయం నుంచి ధర్నా చేశారు. తనను కూడా అరెస్టు చేయాలంటూ పోలీస్ స్టేషన్లోనే కూర్చుండిపోయారు. ఎన్ని రకాలుగా చెప్పిన ఆయన వినలేదు. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని వ్యాన్ ఎక్కించి అతని స్వగ్రామమైన కిర్లంపూడికి తరలించారు. అయినా సరే వ్యాన్ దిగకుండా ఆయన లోపలే కూర్చుని ఉన్నారు. పోలీసులు ముద్రగడ ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారు. ముగ్రగడ అభిమానులు అమలాపురం పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.
కిర్లంపూడికి ముద్రగడ తరలింపు
తునిలో జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు
TNN 7 Jun 2016, 2:58 pm