యాప్నగరం

బాబు జైలుకు పోతేగానీ వ్యవస్థ బాగుపడదు: జగన్

పక్క పార్టీ నాయకులను కొనుగోలు చేయడం, ప్రలోభాలకు లొంగకపోతే ప్రాణాలు తీయడం..

TNN 22 May 2017, 3:21 pm
పక్క పార్టీ నాయకులను కొనుగోలు చేయడం, ప్రలోభాలకు లొంగకపోతే ప్రాణాలు తీయడం టీడీపీ విధానంగా మారిందని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ విమర్శించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి చెరకులపాడు నారాయణరెడ్డి హత్యలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ఇవాళ (మే 22) ఉదయం ఆయన ఈ అంశంపై గవర్నర్‌ నరసింహన్‌‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు జైలుకు పోతే తప్ప వ్యవస్థ బాగుపడే పరిస్థితి లేదు’ అని జగన్ అన్నారు. గడిచిన మూడున్నరేళ్ల కాలంలో టీడీపీ దారుణాలకు బలై పోయిన వైఎస్సార్‌సీపీ నేతల జాబితాను గవర్నర్‌కు అందజేసినట్లు ఆయన తెలిపారు.
Samayam Telugu law and order situation in the state is going from bad to worse says ys jagan
బాబు జైలుకు పోతేగానీ వ్యవస్థ బాగుపడదు: జగన్


‘కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి కుమారుడు సాగిస్తున్న ఇసుక మాఫియాపై దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించే వరకూ నారాయణ రెడ్డి పోరాడారు. అందుకే ఆయణ్ని హత్య చేయించారు. ఆయన గన్‌ లైసెన్స్‌ రెన్యూవల్‌ కూడా ఉద్దేశ పూర్వకంగానే చేయలేదు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఈ హత్య చేయిస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపూర్ణంగా సహకరించారు’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

తన ప్రాణాలకు హానీ ఉందని, రక్షణ కల్పించాలని నారాయణ రెడ్డి పలుమార్లు పోలీసులను అభ్యర్థించారని జగన్‌ గుర్తు చేశారు. నారాయణరెడ్డి ఓ నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జిగా, ఆయన భార్య కర్నూలు డీసీసీబీ చైర్‌పర్సన్‌గా జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉండగా.. వారికి రక్షణ కల్పించకపోవడం దారుణమని జగన్‌ పేర్కొన్నారు. హత్య జరిగిన తర్వాత హంతకులను పట్టుకునే విషయంలోనూ పోలీసులు తాత్సారం చేశారని ఆయన ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.