యాప్నగరం

పోలెక్కిన చిరుత.. షాక్‌తో మృతి!

నిజామాబాద్ జిల్లాలోని మల్లారం అటవీ ప్రాంతంలో ఓ చిరుత పులి విషాదకర రీతిలో దుర్మరణం పాలైంది..

TNN 3 Jul 2017, 4:50 pm
నిజామాబాద్ జిల్లాలోని మల్లారం అటవీ ప్రాంతంలో ఓ చిరుత పులి విషాదకర రీతిలో దుర్మరణం పాలైంది. దారి తప్పి జనావాసాల వైపు వచ్చిన చిరుత విద్యుత్ స్తంభం ఎక్కింది. షాక్‌ కొట్టడంతో అది పోల్‌పైనే ప్రాణాలు కోల్పోయింది. అది విద్యుత్ స్తంభంపై అలాగే వేలాడుతూ ఉండిపోయింది. చిరుత మృతిపై స్థానిక ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు కలిసి ఆ చిరుత పులి మృత దేహాన్ని కిందకు దించారు.
Samayam Telugu leopard dies on electricity pole in nizamabad
పోలెక్కిన చిరుత.. షాక్‌తో మృతి!


అయితే, చిరుత పులి అలా విద్యుత్ స్తంభంపైకి ఎక్కడం, షాక్‌తో ప్రాణాలు కోల్పోవడం పట్ల కొంత మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.