యాప్నగరం

ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కలకలం.. భయాందోళనలో విద్యార్థులు

తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలంరేపుతోంది. క్యాంపస్‌లో రెండు లేగదూడలపై చిరుత దాడి చేసి చంపడంతో భయంతో వణికిపోతున్నారు.

Samayam Telugu 5 Aug 2018, 3:13 pm
తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలంరేపుతోంది. క్యాంపస్‌లోని ఆడిటోరియం సమీపంలో రెండు లేగదూడలు పడి ఉన్నాయి. ఉదయం అటువైపుగా వెళ్లిన కొంతమంది విద్యార్థులు.. దూడల్ని గమనించి వర్శిటీ, అటవీశఆఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు స్పాట్‌కి వెళ్లి పరిశీలించగా.. దూడల శరీరంపై గాయాలను గుర్తించారు. వాటిని చిరుత పులి పంజాలుగా తేల్చిన అధికారులు.. కొద్ది దూరంలోనే డీడీఈ బిల్డిండ్ దగ్గర చిరుత కాలి గుర్తుల్ని గమనించారు.
Samayam Telugu SV University


రక్తపు మరకలతో కాలి గుర్తులు ఉండటంతో.. చిరుతే దూడల్ని చంపి తిని ఉంటుందని అటవీశాఖ సిబ్బంది అనుమానిస్తున్నారు. కాలి గుర్తుల ఆధారంగా చిరుత జాడను తెలుసుకునే పనిలో ఉన్నారు. మరోవైపు వర్సిటీ క్యాంపస్‌లో చిరుత సంచారం గురించి తెలియడంతో విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.