యాప్నగరం

హైదరాబాద్ శివారులో చిరుత సంచారం.. స్థానికుల్లో టెన్షన్

హైదరాబాద్ శివారులో చిరుత సంచారం కలకలంరేపుతోంది. పొలంలో ఉన్న పశువుల షెడ్‌లో రెండు దూడల్ని చిరుత చంపేసింది.

Samayam Telugu 1 Apr 2018, 11:44 am
హైదరాబాద్ శివారులో చిరుత సంచారం కలకలంరేపుతోంది. ఘట్‌కేసర్ మండలం కొండాపూర్‌కు చెందిన నరసింహారెడ్డి అనే రైతుకు పొలం, బావి ఉన్నాయి. పక్కనే పశువుల కోసం షెడ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఉదయం పొలానికి వెళ్లిన రైతు అక్కడి సీన్ చూసి షాకయ్యాడు. షెడ్‌లో ఉన్న రెండు దూడలు చనిపోయి కనిపించాయి. వాటి ఒంటిపై ఘాట్లు, దెబ్బలు కూడా కనిపించాయి. అనుమానంతో చుట్టు పక్కల పరిశీలించగా చిరుత తిరిగినట్లు గుర్తులు కనిపించాయి.
Samayam Telugu Chirutha


భయంతో వణికిపోయిన నరసింహారెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి... అటవీశాఖ అధికారులకు విషయాన్ని వివరించారు. వారు చిరుత కోసం గాలింపు మొదలు పెట్టారు. అయితే చిరుత సంచారం ఉందని తెలియడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.