యాప్నగరం

ఎస్సీలకు గుర్తింపు లేదు, నాది రనౌట్!

సమర్ధులైన షెడ్యూల్డు కులాలకు చెందిన ఉన్నతాధికారుల పని తీరుకు తగిన గౌరవం దక్కడం లేదని

Samayam Telugu 5 Jan 2017, 7:41 am
సమర్ధులైన షెడ్యూల్డు కులాలకు చెందిన ఉన్నతాధికారుల పని తీరుకు తగిన గౌరవం దక్కడం లేదని తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కె. ప్రదీప్ చంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ అధికారులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందనే సందేశం వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలదేనని ఆయన అన్నారు.
Samayam Telugu let sc officers not go down says ias pradeep chandra
ఎస్సీలకు గుర్తింపు లేదు, నాది రనౌట్!


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ప్రదీప్ చంద్రకు తెలంగాణ సచివాలయంలో అభినందన సభ ఏర్పాటు చేవారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రదీప్ చంద్ర మాట్లాడుతూ ‘‘ఉద్యోగం జీవితంలో ఎప్పుడూ హుందాగానే ప్రవర్తించా. ఎవరికీ తలవంచలేదు. వన్ డౌన్ బ్యాట్స్ మేన్ గా వచ్చానని సీఎం చెప్పారు. దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యా. సమర్ధులైన నిజాయితీపరులైన అధికారులకు తగిన గుర్తింపు లభించలేదనే సందేశం వెళ్లకూడదని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఎస్సీ అధికారులకు తగి ప్రాధాన్యం ఇవ్వలేదనే మాట రాకూడదనే చెబుతున్నా. ఇప్పుడంతా దాన్ని గురించే మాట్లాడుతున్నారు. అది నిజం కూడా. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాలి. లేకపోతే యువ అధికారులు నిరుత్సాహ పడిపోతారు’’ అని అన్నారు.

డిసెంబర్ 1న సీఎస్ పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రదీప్ చంద్రకు కేవలం నెల రోజుల మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. ఆయన పదవీని మరో మూడు నెలల కాలం పాటు పొడగించాలని పలువురు విజ్ఞప్తి చేసినప్పటికీ..ప్రభుత్వం సీరియస్ గా ప్రయత్నించలేదనే ఆరోపణలు వినిపించాయి. దీనిపై ప్రదీప్ చంద్రకు మద్దతుగా దళిత సంఘాలు సైతం గళం విప్పాయి.

అయితే టీఎస్ఐపాస్ వంటి వినూత్య పథకాన్ని శ్రీకారం చుట్టిన ప్రదీప్ చంద్ర వంటి సమర్ధులైన అధికారుల సేవలు మరో రకంగా వినియోగించుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.