యాప్నగరం

తెలుగు రాష్ట్రాల్లో పిడుగుల వర్షం: 12 మంది మృతి

తెలుగు రాష్ట్రాల్లో పిడుగులు పడి ఆదివారం 12 మంది మృతి చెందారు.

Samayam Telugu 13 May 2018, 11:51 pm
తెలుగు రాష్ట్రాల్లో పిడుగులు పడి ఆదివారం 12 మంది మృతి చెందారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ముగ్గురు రైతులు మృతి చెందగా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 9 మంది మృతిచెందారు. అరేపల్లి గ్రామంలో వరి పైరు తడవకుండా కాపాడుకునేందుకు వెళ్లిన ఆర్.రాజయ్య, కె.బాపు, జె.రాజేష్‌లు పిడుగుపాటుకు గురై మృతి చెందారు.
Samayam Telugu aaaaa


ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గోదావరి జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, మెలియపురంలో పిడుగులతో కూడిన వర్షాలకు నలుగురు వ్యక్తులు చనిపోయారు. మరికొన్ని ప్రాంతాల్లో మరో ఇద్దరు చనిపోయినట్లు సమాచారం. చనిపోయినవారిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. కడపటి వార్తలు అందేసరికి విశాఖ, విజయనగరం జిల్లాల్లో మరో ఇద్దరు పిడుగుపాటుకు చనిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.