యాప్నగరం

నడిరోడ్డుపై కిరాతకంగా నరికి చంపారు!

ఎవరన్నారు.. రాయలసీమలో ఫ్యాక్షనిజం కనుమరుగైందని. ఇదిగో సజీవ సాక్ష్యం.

TNN 25 May 2017, 3:31 pm
ఎవరన్నారు.. రాయలసీమలో ఫ్యాక్షనిజం కనుమరుగైందని. ఇదిగో సజీవ సాక్ష్యం. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని అతి కిరాతకంగా వేట కొడవలితో నరికి చంపారు. ఇద్దరు వ్యక్తులు కలసి చేసిన ఈ అకృత్యాన్ని అక్కడున్నవారంతా చూస్తూ ఉండిపోయారు. దగ్గరికెళితే తమపై దాడిచేస్తారని భయపడ్డారో ఏమో కానీ.. ఒక్కరు కూడా అతన్ని కాపాడే ధైర్యం చేయలేదు. ఓ వ్యక్తి గట్టిగా పట్టుకుని కూర్చుంటే.. మరో వ్యక్తి వేటకొడలవితో సుమారు 10కి పైనే వేట్లు వేశాడు. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. పనిపూర్తయిందని భావించిన దుండగులు హుందాగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ప్రత్యక్ష హత్యను స్మార్ట్‌ఫోన్లలో బంధించిన కొందరు సోషల్ మీడియాలో పెట్టారు.
Samayam Telugu live murder in proddatur kapada district
నడిరోడ్డుపై కిరాతకంగా నరికి చంపారు!


ఇంతకీ.. ఈ దారుణ ఘటన కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక కోర్టుకు సమీపంలోనే ఈ హత్య జరగడం గమనార్హం. ఓ కేసు విషయమై కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు వచ్చిన మారుతీ ప్రసాద్‌రెడ్డి అనే వ్యక్తిని అందరూ చూస్తుండగానే ప్రత్యర్థులు నరికి చంపారు. మృతుడు జమ్మలమడుగు మండలం దేవగుడికి చెందినవాడని తెలిసింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితులు వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.