యాప్నగరం

ఇప్పుడు ఎన్నికలొస్తే టీడీపీకి ఎన్ని సీట్లంటే!

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో

TNN 3 Aug 2017, 10:22 am
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో 140 సీట్లు తమకే దక్కుతాయని అన్నారు ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి వంద రోజులు పూర్తి అయిన నేపథ్యంలో ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడుతూ.. మళ్లీ విజయం తమ పార్టీదే అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తమ పార్టీ పట్ల సానుకూల ధోరణితో ఉన్నారని అన్నారు.
Samayam Telugu lokesh confident on win again
ఇప్పుడు ఎన్నికలొస్తే టీడీపీకి ఎన్ని సీట్లంటే!

​ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఏపీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని వ్యాఖ్యానించడంపై స్పందించారు లోకేష్. ఆయన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని అంటూనే.. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 140 సీట్లు తమవే అని వ్యాఖ్యానించారు.

ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే.. జనసేన, భారతీయ జనతా పార్టీలతో తమ సాన్నిహిత్యం కొనసాగుతుందోని లోకేష్ ప్రకటించడం. వచ్చే ఎన్నికల్లో కూడా తమ కూటమి కలిసే పోటీ చేస్తుందని, అందులో ఎలాంటి అనుమానమూ లేదని లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని, పవన్ కల్యాణ్ పార్టీతోనూ సన్నిహిత సంబంధాలున్నాయని లోకేష్ తెలిపారు. తమ పార్టీలు కలిసే పోటీ చేస్తాయన్నారు.

అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో కూడా తనకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయని లోకేష్ తెలిపారు. తమ మధ్య ఎలాంటి విబేధాలూ లేవన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని లోకేష్ విశ్వాసం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.