యాప్నగరం

జగన్ కు దమ్ముంటే నాపై ఆరోపణలు నిరూపించాలి - లోకేష్

మూడో రోజు మహానాడు సందర్భంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రసంగించారు.

TNN 29 May 2016, 3:01 pm
తిరుపతి: అవినీతి ముద్రపడిన జగన్ కు మాపై ఆరోపణలు చేసే నైతిక హక్కు లేదని నారా లోకేష్ అన్నారు.మూడో రోజు మహానాడు కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు తనయుడు నారాలోకేష్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన విపక్ష పార్టీ అధినేతపై విమర్శల వర్షం కురింపించాడు. వైసీపీ తమ కుంటుంబపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని నారా లోకేష్ మండిపడ్డారు. 40 కేసులు నెత్తిమీద ఉండి.. 16 నెలలు జైల్లో గడిపిన వ్యక్తి ...మచ్చలేని మా కటుుంబంపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తనతో పాటు తమ కుంబుంబంపై చేస్తున్నా ఏ ఒక్క ఆరోపణనైనా జగన్ కు దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. పట్టిసీమ విషయంలో వైసీపీ ధ్వంద వైఖరి అవలంభిస్తోందన్నారు. పట్టిసీమతో ఉభయగోదావరి జిల్లాలకు నష్టం వాటిల్లుతుందని ఒకవైపు అటు ప్రచారం చేస్తూ.. పట్టిసీమతో రాయలసీమకు ఒక్క చుక్కనీరందడం లేదని జగన్ ఊసరవెల్లి రాజకీయాలకు పాల్పడుతున్నారని లోకేష్ మండిపడ్డారు
Samayam Telugu lokesh speech in mahanadu
జగన్ కు దమ్ముంటే నాపై ఆరోపణలు నిరూపించాలి - లోకేష్


హామీల బాధ్యత కేంద్రానిదే....

రాష్ట్ర విభజన చేసి రాష్ట్రాన్ని ఈ స్థితికి తెచ్చిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు. రాష్ట్రాన్ని దారుణ స్థితిలో నెట్టిన కాంగ్రెస్ ఏపీలో నామ రూపాలు లేకుండా పోయిందని.. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బకొట్టే వారు ఎవరైనా సరే ఇలాంటి గతే పడుతుందన్నారు. విభజనహామీలు నెరవేర్చే బాధ్యత కేంద్రంపై ఉందని.. విభజన బిల్లుతో సహా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందన్నారు. విభజన హామీల బాధ్యత కేంద్రంపై నెడుతూ అవి నెరవేర్చకుంటే కాంగ్రెస్ పట్టిన గతే బీజేకి కూడా పడుతుందని లోకేష్ పరోక్షంగా హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.