యాప్నగరం

చంద్రబాబు.. సుబ్రమణ్యం ఫర్ సేల్ అయ్యారు!

ఏపీని దక్షిణ కొరియా తన రెండో రాజధానిగా భావించి పరిశ్రమలు స్థాపించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై లోక్‌సత్తా

TNN 5 Dec 2017, 9:47 am
ఏపీని దక్షిణ కొరియా తన రెండో రాజధానిగా భావించి పరిశ్రమలు స్థాపించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై లోక్‌సత్తా ఏపీ విభాగం ఫైర్ అయ్యింది. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్య చేయడం పట్ల లోక్‌సత్తా ఏపీ విభాగం అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ఆసక్తిదాయకమైన రీతిలో విమర్శించారు. చంద్రబాబు నాయుడు ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లాగా మారారు.. అంటూ ఆయన విమర్శించారు.
Samayam Telugu loksatta slams ap cm
చంద్రబాబు.. సుబ్రమణ్యం ఫర్ సేల్ అయ్యారు!


ఏ దేశం వెళితే అక్కడ చంద్రబాబు నాయుడు ఒకే రకమైన పాట పాడుతున్నారని, ఇది వరకూ జపాన్ వెళ్లినప్పుడు అమరావతిని జపాన్ రెండో రాజధానిగా భావిస్తోందని చంద్రబాబు ప్రకటించిన వైనాన్ని లోక్‌సత్తా నేత గుర్తు చేశారు. ఇప్పుడు దక్షిణ కొరియాకు వెళితే ఏపీనే ఆ దేశానికి రెండో రాజధాని అంటున్నారని విమర్శించారు.

ఇలాంటి మాటలతో ఆంధ్రప్రదేశ్ ను అమ్మకానికి పెట్టి భిక్ష అడుగుతున్నట్టుగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు. లెక్కకు మించి విదేశీ పర్యటనలు చేశారు, ఏపీలో పెట్టుబడుల కోసం అంటూ సదస్సులు నిర్వహించారు.. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు.. అని ఆయన వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.