యాప్నగరం

ఏర్పేడు బాధితుల్లో పోలీసులు, విలేకరులు కూడా...

చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద జరిగిన లారీ అదుపుతప్పి బీభత్సాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే.

TNN 21 Apr 2017, 3:57 pm
చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద జరిగిన లారీ అదుపుతప్పి బీభత్సాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 15 మంది దాకా మరణించినట్టు సమాచారం. అధికారికంగా పోలీసులు ఇంకా సంఖ్యను ప్రకటించలేదు. జరిగిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. చిత్తూరు కలెక్టర్ తో మాట్లాడి వివరాలు కనుక్కున్నారు. మంత్రులు కూడా ఘటనపై ఆరాతీశారు. కొందరు మంత్రులు వెంటనే ఘటనాస్థలికి బయలుదేరి వెళ్లారు. ఏర్పేడు పోలీస్ స్టేషన్ దగ్గరే ఈ ఘటన జరగడం సంచలనం సృష్టించింది.
Samayam Telugu lorry accident in chittoor 15 died
ఏర్పేడు బాధితుల్లో పోలీసులు, విలేకరులు కూడా...


స్వర్ణముఖీ నదీ తీరంలో జరుగుతున్న ఇసుక మాఫియాపై ఫిర్యాదు ఇచ్చేందుకు 50 మంది దాకా పోలీస్ స్టేషన్ కు వచ్చారు. పోలీసులకు వినతి పత్రం ఇచ్చాక... స్టేషన్ బయట ఉన్న దుకాణాల సమీపంలో నిల్చుని పోలీసులతో మాట్లాడుతున్నారు ప్రజలు. ఈలోపే మృత్యువు రూపంలో లారీ అక్కడికి దూసుకొచ్చేసింది. ఈ ఘటనలో మొత్తం 15 మంది మరణించినట్టు భావిస్తున్నారు. 20 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో సీఐ, ఎస్ ఐ కూడా ఉన్నట్టు ఎస్పీ చెప్పారు. అలాగే ఆంధ్రజ్యోతి పత్రిక విలేకరి కూడా తీవ్రంగా గాయపడ్డారు. అతని రెండు కాళ్లు విరిగిపోయాయి. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్టు రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మృతులను కుటుంబాలను ఆదుకుంటామని, సీఎంతో మాట్లాడాక పరిహారం ప్రకటిస్తామని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.