యాప్నగరం

పండగపూట విషాదం.. రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి

పండగపూట తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు పెను విషాదాన్నే నింపాయి. మక్కంటి దర్శనానికి వెళ్లి, తిరిగి వస్తూ ప్రమాదానికి గురైన ఘటన చిత్తూరులో చోటుచేసుకుంది.

TNN 13 Feb 2018, 11:04 am
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనానికి వెళ్లి, తిరిగి వస్తోన్న భక్తులు ప్రయాణిస్తోన్న ఆటోను బిఎన్ కండ్రిగ మండలం మయూర షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురు షుగర్ ఫ్యాక్టరీలో కూలీలుగా పనిచేస్తున్నారు. తెల్లవారుజామున వాయలింగేశ్వరుని దర్శించుకొని తిరిగి ఫ్యాక్టరీలో పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు రామారావు, కుమారిలతోపాటు ఆటో డ్రైవర్ వెంకటరమణ, చిత్తూరు జిల్లా పీలేరు ప్రాంతానికి అక్కాతమ్ముళ్లు బిందు, అనంత్‌ ప్రాణాలు కోల్పోయారు.
Samayam Telugu lorry hits auto rickshaw killing five in chittoor district
పండగపూట విషాదం.. రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి


ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.మరోవైపు తెలంగాణలోనూ జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తోన్న వాహనం డివైడర్‌ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఈ ఇద్దరు మరణించారు. అలాగే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జక్కేపల్లిలో బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.