యాప్నగరం

అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని నలుగురి మృతి

అనంతపురం జిల్లాలో బైక్‌ను ఢీకొట్టి బోల్తాపడిన లారీ.. బైక్‌పై వెళుతున్న ముగ్గురుతో పాటూ లారీ క్లీనర్ మృతి. లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు.

Samayam Telugu 12 Jun 2019, 3:17 pm

ప్రధానాంశాలు:

  • నార్పల మండలం ముచ్చుకోట కనుమ దగ్గర ప్రమాదం
    అతి వేగమే ప్రమాదానికి కారణమంటున్న స్థానికులు
    బైక్‌ను ఢీకొట్టిన వెంటనే బోల్తాపడిన లారీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu lorry
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం మధ్యాహ్నం నార్పల మండలం ముచ్చుకోట కనుమ దగ్గర బైక్‌ను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు చనిపోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడ్ని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో బైక్‌ను ఢీకొట్టిన తర్వాత లారీ బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురితో పాటూ లారీ క్లీనర్‌ కూడా చనిపోయాడు. లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతడ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. లారీ బోల్తాపడటంతో.. కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. లారీని తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.