యాప్నగరం

ఐదేళ్ల వారి ప్రేమ విషాదాంతమైంది

ఈ విషాదకర ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లా కోయల్‌సాగర్లో చోటుచేసుకుంది. ఒక్కరోజు వ్యవధిలో చోటుచేసుకున్న రెండు ఆత్మహత్యలు స్థానికంగా సంచలనం కలిగించాయి.

Samayam Telugu 18 Dec 2018, 10:12 am
వారిద్దరూ ఐదేళ్లపాటు ప్రేమించుకున్నారు. అయితే ఆ అమ్మాయికి పెద్దలు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. తమ ప్రేమను పెద్దలకు చెప్పి ఒప్పించే ధైర్యం లేక ఇద్దరూ తనువు చాలించారు. ఈ విషాదకర ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లా కోయల్‌సాగర్లో చోటుచేసుకుంది. ఒక్కరోజు వ్యవధిలో చోటుచేసుకున్న రెండు ఆత్మహత్యలు స్థానికంగా సంచలనం కలిగించాయి.
Samayam Telugu loverssuicide


స్థానికుల వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం ప్రాంతానికి చెందిన చెన్నకేశవులు(21), రాధిక ఇంటర్‌ చదువుతున్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు. అప్పటినుంచి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇటీవల రాధికకు బ్యాంకు ఉద్యోగం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఉంటోంది. త్వరలోనే వివాహబంధంతో ఒక్కటి కావాలని వారిద్దరూ ఎన్నో కలలు కన్నారు. అయితే రాధికకు కుటుంబసభ్యులు ఇటీవల వేరే వ్యక్తితో వివాహం కుదిర్చి నిశ్చితార్థం జరిపించారు. ఈ విషయం తెలిసిన కేశవులు ఆదివారం రాధికకు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడి తన ఆవేదనను తెలిపాడు. ఆ తర్వాత ఇంట్లో కుటుంబసభ్యులు లేని సమయం చూసి ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ప్రియుడి మరణంతో షాక్‌కు గురైన రాధిక సోమవారం ఉదయం బ్యాంక్‌కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఎడమకాల్వలో దూకేసింది. ప్రాజెక్టు సిబ్బంది సమాచారంతో ఏఎస్‌ఐ ఖలీల్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. గజ ఈతగాళ్లతో వెతికించినా రాధిక ఆచూకీ దొరకలేదన్నారు. ఈ రెండు ఘటనలతో చిన్నకేశవులు, రాధిక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.