యాప్నగరం

గెలిచేది కూటమి.. 11 తర్వాత కేసీఆర్ మూట సర్దేయడమే: బుద్ధా

జగన్, పవన్ కేసీఆర్‌తో కుమ్మక్కయ్యారు.. ఈ కూటమికి ప్రధాని మోదీది నాయకత్వం. ఈనెల‌ 11 తర్వాత తెలంగాణలో కేసీఆర్ మూట, ముల్లు సర్దుకోవడం ఖాయం.

Samayam Telugu 9 Dec 2018, 3:30 pm
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అవినీతి గురించి మాట్లాడటం పెద్ద జోక్ అన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. అక్రమాస్తుల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి.. అవినీతి రహిత పాలన అందిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన వెంకన్న.. వైసీపీ, జనసేన, బీజేపీలపై మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu ts.


తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా జగన్, పవన్ కేసీఆర్‌తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు వెంకన్న. టీఆర్ఎస్‌తో రహస్య కూటమి కట్టారని.. ఆ కూటమికి ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తున్నారన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఉన్న రాజకీయ కలుపు మొక్కలను ఏరివేయడానికి చంద్రబాబు ప్రకృతి వ్యవసాయం చేపట్టారని.. బాబు దెబ్బకు మోడీ, కేసీఆర్‌, జగన్, పవన్‌లు రాజకీయాల నుంచి పారిపోవడం ఖాయమన్నారు. టీడీపీ అధినేత దేశంలోనే ఒక లెజెండ్.. ఆయన ఎవరికి మద్దతు ఇస్తే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్నారు.

చంద్రబాబును తానే అధికారంలోకి తెచ్చానంటున్న పవన్‌.. 2019 ఎన్నికలలో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసి గెలిపించే దమ్ముందా అని సవాల్ విసిరారు బుద్దా. ప్రజల కోసం కేంద్రంతో పోరాడుతున్న చంద్రబాబుపై విషం చిమ్మడమే పవన్ పనిగా పెట్టుకున్నారని ఫైరయ్యారు. పవన్ , జగన్‌లకు చంద్రబాబు తప్ప ఎవరూ కనిపించడం లేదా అని ప్రశ్నించిన వెంకన్న.. కేంద్రం చేసిన అన్యాయంపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు.

తెలంగాణలో ప్రజా కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు బుద్ధా వెంకన్న. ఈనెల‌ 11 తర్వాత తెలంగాణలో కేసీఆర్ మూట, ముల్లు సర్దుకోవడం ఖాయమన్నారు. తెలంగాణలో చంద్రబాబు ప్రచారంతో ప్రజల్లో ఓ భరోసా వచ్చిందన్నారు. తెలుగువారు ఎక్కడున్నా వారి కోసం తాను ఉన్నానంటూ చంద్రబాబు ముందుకొస్తారని వ్యాఖ్యానించారు. పదో తేదీన జాతీయ స్థాయి నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించి సత్తా చాటతారన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.