యాప్నగరం

ఏపీ ఎంపీలకు చేవలేదు: కత్తి మహేష్

సినీ విమర్శకుడు కత్తి మహేష్ ట్విట్టర్లో మరో దుమారానికి తెరలేపాడు. అయితే, ఈ సారి ఆయన టార్గెట్ పవన్ కళ్యాన్ కాదు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు. గురువారం తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటన అంటూ ఏపీ ఎంపీలపై విమర్శలు గుప్పించాడు.

TNN 28 Dec 2017, 10:23 pm
సినీ విమర్శకుడు కత్తి మహేష్ ట్విట్టర్లో మరో దుమారానికి తెరలేపాడు. అయితే, ఈ సారి ఆయన టార్గెట్ పవన్ కళ్యాన్ కాదు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు. గురువారం తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటన అంటూ ఏపీ ఎంపీలపై విమర్శలు గుప్పించాడు. ‘‘ప్రకటన: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేవగల ఎం.పి.లు కావలెను" అంటూ పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘చేవ’ అంటే ఏమిటని ప్రశ్నించాడు. ఇందుకు సమాధానం ఇస్తూ "పార్లమెంటులో గొంతు విప్పి రాష్ట్రం కోసం పోరాడటం చేతనవ్వాలి.. అదే చేవ" అని సమాధానమిచ్చాడు. అదేదో మీరే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ప్రయత్నించవచ్చు కదా అని మరికొందరు ప్రశ్నించారు. ఇంకొందరు ఆయనపై విమర్శలు గుప్పించారు. మరి, కత్తి మహేష్ కామెంట్లపై ఏపీ ఎంపీలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Samayam Telugu mahesh kathi sensational comments on andhra pradesh mps
ఏపీ ఎంపీలకు చేవలేదు: కత్తి మహేష్

ప్రకటన: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేవగల ఎం.పి.లు కావలెను. — Mahesh Kathi (@MaheshhKathi) December 28, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.