యాప్నగరం

ప్రేమించానని చెప్పి పాతిపెట్టేశాడు!

ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని చెప్పి... ఆమెను ఎందుకంత దారుణంగా హతమార్చాడు? ఏ తప్పు చేయని ఆమెకు ఎందుకంత శిక్ష?

TNN 6 Mar 2018, 10:14 pm
ప్రేమించా, పెళ్లి చేసుకుంటానని ప్రియుడు చెప్పిన మాయ మాటలు నమ్మిన ఆ యువతి.. అతడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్లితే.. తెలంగాణలోని భువనగిరి జిల్లా మొత్కూరులోని బుజిలాపురం గ్రామానికి చెందిన కాసగాని నరేష్ (28), అదే ప్రాంతానికి చెందిన బొడ్డుపల్లి భార్గవి ఆత్మకూరులోని వినాయక ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. అక్కడ అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్న నరేష్, నర్సుగా పనిచేస్తున్న భార్గవిని ప్రేమించాడు.
Samayam Telugu man allegedly kills girl friend buried at the well in telangana
ప్రేమించానని చెప్పి పాతిపెట్టేశాడు!


అయితే, నరేష్‌కు నాలుగేళ్ల కిందటే ఓ యువతితో వివాహమైంది. ఆమెతో విభేదాలు రావడంతో విడకులు తీసుకున్నాడు. ఆ తర్వాత భార్గవిని ప్రేమలోకి దించి, పెళ్లి చేసుకుంటానని లోబరుచుకున్నాడు. అయితే, భార్గవిని కాకుండా మరో యువతిని పెళ్లి చేసుకోడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసి భార్గవి.. నరేష్‌ను నిలదీసింది. దీంతో ఆమెను వ్యవసాయ బావి వద్దకు తీసుకెల్లి తలపై బండరాయితో కొట్టి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని అక్కడే పూడ్చిపెట్టాడు.

ఈ ఘటన చోటు చేసుకున్న మరుసటి రోజు తెల్లవారుజామునే నరేష్ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే, భార్గవి ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆసుపత్రిలో ఆరాతీయగా నరేష్ ప్రేమ వ్యవహారం బయటపడింది. దీంతో పోలీసులు నరేష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. తన పెళ్లికి అడ్డు వస్తుందని చంపి, పాతి పెట్టేశానని చెప్పాడు. పోలీసులు శవాన్ని వెలికి తీసి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.