యాప్నగరం

తల్లీకూతుళ్లతో సహజీవనం.. మనవరాలిపై కూడా..?

తల్లీ కూతుళ్లతో సహజీవనం చేస్తూ.. చివరికి మనవరాలిపై కూడా కన్నేశాడు ఓ కామాంధుడు. చివరికి ధైర్యం చేసిన బాధితురాలు గుంటూరు

Samayam Telugu 3 Apr 2018, 10:16 am
తల్లీ కూతుళ్లతో సహజీవనం చేస్తూ.. చివరికి మనవరాలిపై కూడా కన్నేశాడు ఓ కామాంధుడు. చివరికి ధైర్యం చేసిన బాధితురాలు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక తోడ్పాటునిచ్చే నెపంతో ఆ ప్రబుద్ధుడు తల్లీకూతుళ్లని శారీరకంగా లోబర్చుకున్నట్లు విచారణలో తేలింది.
Samayam Telugu ..


పోలీసుల కథనం ప్రకారం.. పిడుగురాళ్లకి చెందిన నాగేశ్వరరావు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్లకి ఆమె కూతురుని కూడా లోబర్చుకుని. ఇద్దరితో సహజీవనం సాగించసాగాడు. ఇటీవల అదే ఇంట్లో ఉంటున్న కూతురు కుమార్తెపై కూడా నాగేశ్వరరావు కన్నేశాడు. ఆమె మూడేళ్లక్రితం భర్తతో విడిపోయి ప్రస్తుతం అమ్మమ్మ ఇంట్లోనే ఉంటోంది.

నాగేశ్వరరావు తన కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడని తల్లీ, అమ్మమ్మలకి బాధితురాలు విషయం చెప్పినా.. వారు అతనికే వత్తాసు పలికారు. దీంతో నాగేశ్వరరావు మరింత రెచ్చిపోగా.. బాధితురాలు వేధింపులు భరించలేక ఇంటి నుంచి పారిపోయి స్నేహితురాలి చెంత చేరింది. ఆమె సాయంతో జిల్లా ఎస్పీ‌కి సోమవారం ఫిర్యాదు చేయగా.. సమగ్ర విచారణ జరపాల్సిందిగా పిడుగురాళ్ల సీఐని ఆయన ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.