యాప్నగరం

కుక్క తెచ్చిన తంటా.. మహిళలపై కాంగ్రెస్ నేత పిడిగుద్దులు

పెంపుడు కుక్క విషయంలో ఇరుగు-పొరుగు ఇళ్లలో ఉండేవారి మధ్య చిచ్చు. కుక్క మూత్రం పోసిందని నిలదీసినందుకు మహిళలపై దాడి చేసిన కాంగ్రెస్ నేత. కేసు నమోదు చేసిన పోలీసులు.

Samayam Telugu 22 Apr 2019, 6:50 pm

ప్రధానాంశాలు:

  • పెద్దపల్లి గాంధీనగర్‌లో ఘటన
  • మహిళలపై కాంగ్రెస్ నేత సందీప్ దాడి
  • సందీప్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
ఓ కుక్క చేసిన పని రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. మూత్ర పోసిందన్న కారణంతో ఇరుగు-పొరుగు ఇళ్లలో ఉండే మహిళలు, మగవాళ్లు జుట్లు పట్టుకొని మరీ చితక్కొట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. ఈ ఘటనలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిపై కేసు నమోదయ్యింది.
పెద్దపల్లి గాంధీనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి కట్కూరి సందీప్‌ పెంపుడు కుక్క పక్కింట్లో మూత్రం పోసింది. తరచూ కుక్క అలాగే పక్కింటి పరిసరాలు అపరిశుభ్రం చేయడంతో.. పొరిగింటివారు సందీప్ కుటంబాన్ని హెచ్చరించారు. ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోలేదు.. మళ్లీ కుక్క మూత్రం పోయడంతో.. పొరిగింట్లో ఉండేవారు నిలదీశారు.

తమనే నిలదీస్తారా అంటూ సందీప్ పక్కింటి మహిళలపై దౌర్జన్యానికి దిగారు. మహిళలని కూడా చూడకుండా చితకబాదాడు. దెబ్బలు తాళలేక మహిళలు పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా సందీప్ మాత్రం వెనక్కు తగ్గలేదు. ఈ గొడవను చుట్టుపక్కల వాళ్లు మొబైల్‌లో రికార్డు చేశారు. గాయపడిన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సందీప్‌పై కేసు నమోదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.