యాప్నగరం

మహేశ్వరంలో అత్తాపూర్ తరహా హత్య.. యువకుడ్ని వెంటాడి చంపిన దుండగులు

నడిరోడ్డుపై యువకుడ్ని వెంటాడి వేటాడి చంపిన ప్రత్యర్థులు.. మహేశ్వరం సమీపంలో సంచలనంగా మారిన హత్య..

Samayam Telugu 7 Oct 2018, 12:00 pm
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సమీపంలో దారుణం జరిగింది. అత్తాపూర్ హత్య తరహాలో.. పాతకక్షలతో ఓ యువకుడ్ని గుర్తు తెలియని దుండగులు నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపారు. చుట్టూ జనం చూస్తుండగానే జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది. స్థానికులు చెబుతున్న వివరాల మేరకు.. ఆదివారం ఉదయం పోట్ల రాజు అనే వ్యక్తి నాగారం సెంటర్‌లో వెళుతుండగా.. దుండగులు వెంబడించారు.
Samayam Telugu Murder


రాజు వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినా దుండగులు వదల్లేదు. వెంటాడి వేటాడి నడిరోడ్డుపైనే అందరూ చూస్తుండగా నరికి చంపి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన చూసిన స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం పంపించారు. కేసు నమోదు చేసి.. నిందితుల్ని గుర్తించే పనిలో ఉన్నారు.

రాజు హత్యకు పాతకక్షలే కారణమని తెలుస్తోంది. రెండేళ్ల క్రితం రాజు, కృష్ణ అనే మరో యువకుడితో కొత్తూరు వెళ్లారు. తర్వాత కృష్ణ అనుమానాస్పద స్థితిలో రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడు. అతడి చనిపోవడానికి రాజు కారణమని భావించి.. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడ్ని అరెస్ట్ చేయగా.. జైలు నుంచి ఈ మధ్యే విడుదలయ్యాడు. కృష్ణ కుటుంబం తమపై కక్షగట్టిందని భావించిన రాజు.. కుటుంబంతో సహా షాద్‌నగర్‌కు మకాం మార్చాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ నాగారం వచ్చి ఇలా హత్యకు గురయ్యాడని స్థానికులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.