యాప్నగరం

భార్యను చంపి భర్త ఆత్మహత్య.. అనాథలైన పసివాళ్లు

అనుమానంతో కట్టుకున్న భార్యను కిరాతకంగా నరికి చంపిన భర్త.. తర్వాత చెట్టుకు ఉరి వేసుకొని భర్త కూడా ఆత్మహత్య. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఘటన.

Samayam Telugu 11 Jan 2019, 1:25 pm

ప్రధానాంశాలు:

  • తల్లిదండ్రుల మరణంతో అనాథలైన పసివాళ్లు
  • చిన్నారుల్ని చూసి స్థానికులు కంటనీరు
  • ఆ పసివాళ్లను చేరదీసే వాళ్లెవరు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ATP.
భార్యపై అనుమానం పెనుభూతమై భర్త కసాయిగా మారాడు. అతి కిరాతకంగా భార్యను నరికి చంపి.. తర్వాత తాను ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. తల్లిదండ్రుల మరణంతో ఇద్దరు పిల్లలు పసిప్రాయంలోనే అనాథలుగా మిగిలారు. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపగా.. ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తోంది.
ఉరవకొండ మండలం వ్యాసపురంకు చెందిన మరన్న,విశాల భార్యాభర్తలు. దంపతులకు ఐదేళ్ల కుమారుడు, ఏడాది వయసున్న పాపం ఉంది. సాఫీగా సాగిపోతున్న కాపురంలో మనస్పర్థలు వచ్చాయి. మరన్న భార్యపై అనుమానం పెంచుకొని.. తరచూ ఆమెతో గొడవపడుతున్నాడు. ఇద్దరి మధ్య రోజూ మాటల యుద్ధం నడిచేది. ఇరుగుపొరుగు ఇళ్లలోవారు సర్థిచెప్పడంతో సద్ధుమణిగేది.

గురువారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కోపంతో రెచ్చిపోయిన మరన్న ఇంట్లో ఉన్న గొడ్డలి తెచ్చి భార్యను దారుణంగా నరికి చంపాడు. తర్వాత తాను గ్రామ శివారుకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. దంపతుల మరణంతో.. ఇద్దరు పిల్లలు ఒంటరివారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పిల్లల్ని ఎవరికి అప్పగించాలన్నదానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఇద్దరు పసివాళ్లను చూసి స్థానికులు కంటనీరు పెట్టుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.