యాప్నగరం

వీడియో: రోడ్డుపై కారు దగ్ధం.. వ్యక్తి సజీవదహనం

రాజీవ్ రహదారిపై మరో దారుణం చోటు చేసుకుంది. ప్రజ్ఞాపూర్‌ సమీపంలోని రిమ్మనగడ్డ వద్ద కారుకు మంటలు అంటుకున్న ఘటనలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు.

Samayam Telugu 2 Jun 2018, 8:37 am
రాజీవ్ రహదారిపై మరో దారుణం చోటు చేసుకుంది. ప్రజ్ఞాపూర్‌ సమీపంలోని రిమ్మనగడ్డ వద్ద కారుకు మంటలు అంటుకున్న ఘటనలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. శుక్రవారం రాత్రి 10:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న కారు రిమ్మనగూడ పెట్రోల్ బంక్ దాటగానే మంటలు చెలరేగాయి. కారులో మంటలు రావడాన్ని గమనించిన తోటి వాహనదారులు, స్థానికులు అద్దాలు పగలగొట్టి అందులోని వ్యక్తి కాపాడే ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.
Samayam Telugu car fire


చూస్తుండగానే.. మంటలు వేగంగా వ్యాపించడంతో కారులోని వ్యక్తి కళ్ల ముందే సజీవ దహనమయ్యాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. మంటల తీవ్రతకు మృతుడి ఎముకలు మాత్రమే మిగిలాయి. దగ్ధమైన కారును మారుతి ఆల్టో పెట్రోల్ మోడల్ కారుగా గుర్తించారు. కారు నెంబర్ AP11P 8686 కాగా, అందులో ఒక్కరే ప్రయాణిస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.