యాప్నగరం

కడప: ప్రియుడితో పట్టుబడ్డ భార్య.. తల నరికి ఠాణాకు

అక్రమ సంబంధం పెట్టుకుందని ఓ వ్యక్తి తన భార్యను నడిరోడ్డుపై నరికేశాడు. అనంతరం ఆమె తలతో పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

Samayam Telugu 10 Oct 2018, 12:04 am
డప జిల్లాలో దారుణ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఆమెను వేట కొడవలితో నరికేసి తల తీసుకొని నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కడప జిల్లా సంబేపల్లిలో మంగళవారం (అక్టోబర్ 9) రాత్రి జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
Samayam Telugu kadapa


సంబేపల్లి మండలం దుద్యాల వడ్డెపల్లెకు చెందిన రాణికి 19 ఏళ్ల కిందట వెంకటరమణ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కొంత కాలం కిందట బతుకుదెరువు కోసం రాణి (32) గల్ఫ్‌కు వెళ్లొచ్చింది. అక్కడ సుండుపల్లె మండలానికి చెందిన ఓ వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

రాణి అక్రమ సంబంధం విషయం భర్త వెంకటరమణ చెవినపడటంతో ఆమెను నిలదీశాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. పోలీసులు రాణికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ రాణి తన ప్రవర్తన మార్చుకోలేదు.

రాణి ఎప్పటిలాగే తరచూ తన ప్రియుణ్ని కలుస్తుండటంతో వెంకటరమణ కోపం పెంచుకున్నాడు. పద్ధతి మార్చుకోకపోతే నరికేస్తానని ఆమెను హెచ్చరించాడు. భార్యను హతమార్చడానికి నిర్ణయించుకున్న వెంకటరమణ.. కొన్ని రోజులుగా ఆమె కోసం కాపు కాస్తున్నాడు.

ఈ క్రమంలో మంగళవారం రాత్రి రాణి తన ప్రియుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా వెంకటరమణ వారిని వెంబడించాడు. దుద్యాల చెక్‌పోస్టు వద్ద వారిని పట్టుకున్నాడు. వెంకటరమణను చూసి రాణి ప్రియుడు ఆమెను బైక్‌పై నుంచి దింపేసి పారిపోయాడు. దీంతో వెంకటరమణ ఆమెను పట్టుకుని అక్కడికక్కడే నరికేశాడు. అనంతరం తలను తీసుకొని సంబేపల్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.