యాప్నగరం

పందెం కాసి ప్రాణం పోగొట్టుకున్న ఉద్యోగి

మద్యం మత్తులో పందెంకాసి ఓ పంచాయతీ ఉద్యోగి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మేడ్చల్ జిల్లాలోని నిజాంపేట గ్రామ పంచాయతీలో ఎలక్ట్రీషియన్‌గా

Samayam Telugu 2 Jul 2018, 9:35 am
మద్యం మత్తులో పందెంకాసి ఓ పంచాయతీ ఉద్యోగి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మేడ్చల్ జిల్లాలోని నిజాంపేట గ్రామ పంచాయతీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న మహేష్.. తన స్నేహితుడు తుర్క చెరువు సమీపంలోని ఎల్లమ్మ గుడి వద్ద ఇచ్చిన విందుకి హాజరయ్యాడు. అక్కడ సహచరులతో కలిసి శనివారం సాయంత్రం మద్యం సేవించిన మహేష్ అనంతరం భోజనం చేస్తుండగా.. పక్కనే ఉన్న మల్లేష్, లింగం.. చెరువు ఇవతలి నుంచి అవతలకి ఈదాలని సరదాగా పందెం వేసుకున్నారు. తాను ఈదుతానంటూ మహేష్ వారి పందెంలోకి వచ్చాడు.
Samayam Telugu download-1-5


పందెంలో భాగంగా చెరువులోకి దూకిన మహేష్.. కొద్దిసేపటి తర్వాత కనిపించలేదు. విందుకి వచ్చిన సహచరులు ఆ సమయంలో భోజనం చేస్తుండటంతో.. ఎవరూ అతడ్ని గమనించలేకపోయారు. దీంతో.. నీటిలో ఊపిరాడక మహేష్ చనిపోయాడు. అప్పటికే చీకటి పడిపోవడంతో పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో రాత్రి 10 గంటలకి మృతదేహాన్ని వెలుపలికి తీశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.