యాప్నగరం

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. వ్యక్తి మృతి

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డులో ఓ జీపు అదుపుతప్పి బైక్‌ను వెనక నుంచ బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.

Samayam Telugu 17 Apr 2019, 7:45 pm
తిరుమల ఘాట్‌ రోడ్డులో చోటుచేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మొదటి ఘాట్‌ రోడ్డు 34వ మలుపు వద్ద బైక్‌ను జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం (ఏప్రిల్ 17) మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మలుపు వద్ద అదుపుతప్పిన జీపు.. బైక్‌ను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి రోడ్డు పక్కన పిట్ట గోడకు బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు.
Samayam Telugu man
తిరుమల ప్రమాదం


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్రం ఆస్పత్రికి తరలించారు. మృతుడిని బలరాంగా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.