యాప్నగరం

చేతబడి చేస్తోందని అనుమానం.. తల్లిని చంపిన కొడుకు

తనపై కన్నతల్లే చేతబడి చేస్తుందని అనుమానించిన ఓ కొడుకు ఆమెను హత్యచేసి, సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, చివరకు తాను తల్లి హత్యచేసినట్టు అంగీకరించాడు.

Samayam Telugu 25 Dec 2018, 10:52 am
తనపై కన్నతల్లే చేతబడి చేస్తుందని అనుమానించిన ఓ కొడుకు ఆమెను హత్యచేసి, సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, చివరకు తాను తల్లి హత్యచేసినట్టు అంగీకరించాడు. దారుణమైన ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మంత్రాలు ప్రయోగించిన తనను అనారోగ్యానికి గురిచేస్తుందనే అనుమానంతో కన్న కొడుకే ఈ దారుణానికి ఒడిగట్టాడు. జిల్లాలోని బోయినపల్లి మండలం విలాసాగర్‌ గ్రామానికి చెందిన నర్సయ్య, చంద్రవ్వ(60) దంపతులకు ఓ కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు శ్రీనివాస్‌ శ్రీనివాస్‌(30)కు వివాహం కాగా, అతడు కరీంనగర్‌ జిల్లా గంగాధరలో కాపురం ఉంటున్నాడు. ఉధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన శ్రీనివాస్ అనారోగ్యానికి గురికావడంతో ఆరు మాసాల కిందట తిరిగొచ్చాడు. తన అనారోగ్యానికి తల్లి మంత్రాలే కారణమని అనుమానం పెంచుకున్నాడు. ఆమె చేతబడి చేయడం వల్లే అరోగ్యం పాడందని భావించిన శ్రీనివాస్, ఇటీవల విలాసాగర్‌లోని తన ఇంట్లో విరుగుడు పూజలు కూడా చేయించాడు.
Samayam Telugu siricilla


అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఎంఆర్ఐ స్కాన్ చేసినా శరీరంలో ఏ లోపం లేదని వైద్య నివేదికల్లో స్పష్టం కావడంతో ఇదంతా తల్లి వేసే మంత్రాల మహిమేనని బలంగా నమ్మాడు. ఆదివారం రాత్రి చంద్రవ్వ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె గొంతునులిమి చంపేశాడు. తర్వాత బల్లపై నుంచి కింద పడి అమ్మ చనిపోయిందంటూ తండ్రి నర్సయ్యకు సమాచారమిచ్చాడు. కానీ, తండ్రి వచ్చి నిలదీయడంతో తనే హత్యచేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో చంద్రయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.