యాప్నగరం

ఆస్తికోసం తండ్రిని దారుణంగా చంపేశాడు

డబ్బు, ఆస్తి మాయలో పడి అయినవాళ్లనే అంతమొందిస్తున్నారు కొందరు దుర్మార్గులు. యాదాద్రి జిల్లాలో కూడా సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. ఆస్తి రాసివ్వలేదనే కోపంతో తండ్రినే చంపేశాడో కొడుకు. రోడ్డుపై వెళుతున్న తండ్రిపైని వాహనంతో ఢీకొట్టి దారుణంగా హతమార్చాడు.

Samayam Telugu 26 Jul 2018, 7:58 am
డబ్బు, ఆస్తి మాయలో పడి అయినవాళ్లనే అంతమొందిస్తున్నారు కొందరు దుర్మార్గులు. యాదాద్రి జిల్లాలో కూడా సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. ఆస్తి రాసివ్వలేదనే కోపంతో తండ్రినే చంపేశాడో కొడుకు. రోడ్డుపై వెళుతున్న తండ్రిపైని వాహనంతో ఢీకొట్టి దారుణంగా హతమార్చాడు. పోలీసుల వివరాల ప్రకారం. యాదాద్రి జిల్లా మర్రికుంట తండాకు చెందిన జాలంకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఇద్దరు కుమారులు కాగా.. రెండో భార్యకు ఓ కుమారుడు ఉన్నారు. జాలంకు మొత్తం 12 ఎకరాల భూమి ఉంది.
Samayam Telugu Murder


మొదటి భార్య సుగుణ ఇద్దరు కొడుకులుతో మర్రికుంటలో జాలం ఉంటున్నాడు. కుటుంబకలహాలు రాడంతో రెండో భార్య లక్ష్మి జనగాం జిల్లా నర్మెట్ మండలం మల్కపేటలో పుట్టింటికి వెళ్లింది. రెండో భార్య కుమారుడు నరేందర్ ఆటో డ్రైవర్ కాగా.. తనకు ఆస్తి రాసివ్వమని తండ్రి, మిగిలిన సొదరులతో గొడవలు పడుతున్నాడు. 2014 నుంచి ఈ వివాదం నడుస్తుండగా.. తండ్రి మాత్రం ఆస్తి రాసివ్వడానికి నిరాకరించాడు. దీంతో తండ్రిపై నరేందర్ కక్షగట్టాడు.

నరేందర్ ఓ పాత కేసు విషయంలో లాయర్‌ను కలిసేందుకు జనగాం నుంచి తుర్కపల్లి వచ్చాడు. అదే సమయంలో జాలం తన ఫించన్ డబ్బు తీసుకునేందుకు బైక్‌పై భువనగిరి బయల్దేరాడు. ఇదే అదునుగా భావించిన నరేందర్.. తుర్కపల్లి-భువనగిరి రోడ్డులో కాపు కాశాడు. తండ్రి బైక్‌పై వెళుతుండగా.. వెనుక నుంచి టాటా సుమోతో ఢీకొట్టాడు. జాలంకు తీవ్ర గాయాలు కాగా.. స్పాట్‌లోనే ప్రాణాలు విడిచాడు. తర్వాత నరేందర్ నేరుగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడ్ని రిమాండ్‌కు తరలించారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.