యాప్నగరం

అమ్మా నన్ను క్షమించు.. యువకుడి సెల్ఫీ సూసైడ్

'అమ్మా నన్ను క్షమించు... నువ్వు నన్ను కష్టపడి పెంచావు. అమ్మాయి మోజులో పడి... నిన్ను సరిగా చూసుకోలేకపోయా... మళ్లీ జన్మంటూ ఉంటే కనుక మంచి కొడుకుగా పుట్టాలని కోరిక. ఇది ఓ యువకుడి ఆవేదన.

Samayam Telugu 31 Mar 2018, 9:34 am
'అమ్మా నన్ను క్షమించు... నువ్వు నన్ను కష్టపడి పెంచావు. అమ్మాయి మోజులో పడి... నిన్ను సరిగా చూసుకోలేకపోయా... మళ్లీ జన్మంటూ ఉంటే కనుక మంచి కొడుకుగా పుట్టాలని కోరిక. ఇది ఓ యువకుడి ఆవేదన. జీవితంలో ఎన్నో తప్పులు చేశానంటూ సెల్ఫీ వీడియో తీసుకొని... రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగిన ఘటన స్థానికంగా కలకలంరేపింది. చోడవరానికి చెందిన రాజశేఖర్‌కు చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. తల్లి అతడ్ని కష్టపడి పెంచింది. అతడు చిన్న, చిన్న ఉద్యోగాలు చేస్తుండేవాడు.
Samayam Telugu Suicide


రాజశేఖర్‌కు మేనమామ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఈ క్రమంలోనే రాజశేఖర్‌కు మరో యువతితో పరిచయం ఏర్పడి... అది కాస్తా వివాహేతర సంబంధం వరకు వెళ్లింది. వీరిద్దరు కలిసి మరో ఇంట్లో ఉంటున్నారు. రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారు. కొంతకాలంగా ఆమె ప్రవర్తనలో మార్పు రావడంతో నిలదీశాడు. దీంతో ఆమె రాజశేఖర్ తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడితో పాటూ భార్య, తల్లిని పీఎస్‌కు పిలిచారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. దీనిని అవమానంగా భావించిన రాజశేఖర్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.

నేరుగా అనకాపల్లి సమీపంలోని విజయరామరాజు పేట అం డర్ బ్రిడ్జి దగ్గరకి వెళ్లాడు. ఓ సెల్ఫీ వీడియో తీసుకొని తర్వాత... రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. తనలా ఎవరూ మోసపోవద్దని... ముఖ్యంగా అమ్మాయిల్ని అసలే నమ్మొద్దని వీడియోలో చెప్పాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు... బంధువులకు అప్పగించారు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో... తల్లి కన్నీటిపర్యంతమయ్యింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.