యాప్నగరం

ఆడపిల్ల పుడుతుందని.. గర్భిణికి నిప్పంటించిన భర్త

ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు.. మళ్లీ భార్య ఆడపిల్లకే జన్మనివ్వబోతోందని తెలుసుకున్న ఓ భర్త మానవత్వాన్ని మరిచిపోయి క్రూరంగా మారాడు.

TNN 19 Jul 2017, 9:04 am
ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు.. మళ్లీ భార్య ఆడపిల్లకే జన్మనివ్వబోతోందని తెలుసుకున్న ఓ భర్త మానవత్వాన్ని మరిచిపోయి క్రూరంగా మారాడు. గర్భంలో ఉన్నది ఆడశిశువు అని తెలుసుకున్న అతను.. భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ మంటలు అతని పెద్ద కుమార్తెకు కూడా వ్యాపించాయి. దీంతో తీవ్ర గాయాలతో తల్లీ కూతురు మృతిచెందారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రావిపహాడ్‌లో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Samayam Telugu man sets his pregnant on fire in hyderabad
ఆడపిల్ల పుడుతుందని.. గర్భిణికి నిప్పంటించిన భర్త


పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. బానోతు శంకర్‌ నాయక్, సావిత్రి దంపతులు రావిపహాడ్‌లో నివాసముంటున్నారు. వారికి కుమార్తెలు శ్రీవేది(7), శ్రీనిజ(4) ఉన్నారు. ప్రస్తుతం సావిత్రి ఏడు నెలల గర్భిణి. ఆమెకు రహస్యంగా లింగ నిర్ధారణ పరీక్ష చేయించిన శంకర్.. గర్భంలో ఉన్నది ఆడశిశువు అని తెలుసుకున్నాడు. దీంతో మూడో సారి ఆడపిల్లే పుడుతుందని భార్యపై కోపం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి బాగా తాగొచ్చిన శంకర్.. భార్యతో గొడవపడి తీవ్రంగా కొట్టాడు. ఆ తరవాత ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన సావిత్రి అక్కడికక్కడే మరణించింది.

ఈ ఘటనలో పక్కనే ఉన్న పెద్ద కుమార్తె శ్రీదేవికి కూడా మంటలు వ్యాపించాయి. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. తల్లి మంటల్లో కాలిపోతున్న సమయంలో చిన్న కూతురు శ్రీనిజ భయపడి మంచం కిందకు దూరడంతో ప్రాణాలు దక్కాయని కుటుంబీకులు చెప్పారు. సావిత్రి తల్లి దండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసుకున్న భువనగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.