యాప్నగరం

పుచ్చకాయ కొనలేదని.. తాగిన మైకంలో భార్యకు..

పుచ్చకాయ కొనలేదన్న కోపంతో భార్యతో గొడవ పెట్టుకున్న భర్త.. కిరోసిన్‌తో ఆమె ఒంటికి నిప్పు అంటించాడు.

Samayam Telugu 20 Mar 2018, 1:56 pm
హైదరాబాద్‌లోని గోల్కోండ ప్రాంతం. సమయం రాత్రి 10 గంటలు కావొస్తోంది. మద్యం సేవించిన సర్వార్ పుచ్చకాయ కొనుక్కోని రా అని తన భార్య తహసీన్ బేగం (42)ను కోరాడు. కానీ బాగా లేటయ్యింది, పైగా ఆదివారం కదా.. బయట ఉండకపోవచ్చని ఆమె చెప్పింది. బయటకు వెళ్లడానికి ససేమిరా అంది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆవేశానికి లోనైన సర్వార్ కిరోసిన్ తీసుకొని భార్యపై చల్లి నిప్పు అంటించాడు. వీరిద్దరి మధ్య గొడవ జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. అతడికి అడ్డులేకపోయింది.
Samayam Telugu పుచ్చకాయ


మంటల్లో తహసీన్ శరీరం 80 శాతం కాలిపోగా.. ప్రస్తుతం ఆమె ఉస్మానియా హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనలో సర్వార్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. తాను భార్యను చంపాలని అనుకోలేదని, తనే ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుందని అతడు వాదిస్తున్నాడు. వాళ్ల అబ్బాయి మాత్రం నాన్నదే తప్పని పోలీసులకు చెప్పాడు. బాధితురాలి వాంగూల్మం తీసుకున్న పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.