విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో ప్రజలు ఉలిక్కిపడే సంఘటన జరిగింది. ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో తుపాకి కాల్పులు కలవరాన్ని సృష్టించాయి. ఆ ఏరియాలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా అరుదు. జగన్మోహన్ అనే చిట్ ఫండ్ వ్యాపారిపై ఓ యువకుడు పట్టపగలు తుపాకితో కాల్పులు జరిపాడు. ఆ యువకుడిని కేశవ్ గా గుర్తించారు పోలీసులు. ఆర్థిక లావాదేవీలే ఈ కాల్పులకు కారణంగా ప్రాథమికంగా నిర్థారించారు పోలీసులు. జగన్మోహన్ కు ప్రాథమిక చికిత్స అందించాక... మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోకి కేజీహెచ్ కు తరలించారు. కేశవ్ ను అరెస్టు చేసి... కాల్పులకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. కాగా జగన్మోహన్ ప్రాణానికి ప్రమాదం లేదని సమాచారం.
బొబ్బిలిలో కాల్పుల కలకలం
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో ప్రజలు ఉలిక్కిపడే సంఘటన జరిగింది.
TNN 16 Apr 2017, 9:53 am