యాప్నగరం

సీఎం జగన్ వినూత్న ఆలోచన.. వైసీపీ ఎమ్మెల్యే ఆచరణ

ముఖ్యమంత్రి జగన్ ఆలోచనను ఆచరణలో పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే. ప్రభుత్వ హాస్టల్స్‌ను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. రాత్రి అక్కడే విద్యార్థులతో కలిసి నిద్రించారు.

Samayam Telugu 21 Jul 2019, 2:25 pm

ప్రధానాంశాలు:

  • ప్రభుత్వ హాస్టల్స్‌లో సమస్యలపై సర్కార్ ఫోకస్
  • హాస్టల్స్ సందర్శించాలని ముఖ్యమంత్రి సూచన
  • జగన్ సూచనతో హాస్టల్‌లో నిద్రించిన ఎమ్మెల్యే
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rk.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. సరికొత్త, వినూత్న నిర్ణయాలతో దూసుకెళుతున్నారు. తాజాగా ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు ప్రభుత్వ అధికారులతో పాటూ ఎమ్మెల్యేలు హాస్టళ్లలో నిద్ర చేయాలనే నూతన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కలెక్టర్లు హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ సమస్యలు తెలుసుకుంటున్నారు.
సీఎం జగన్ సూచనను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి కూడా పాటించారు. దుగ్గిరాల ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థినుల హాస్టల్‌కు వెళ్ళి అక్కడ వారి సమస్యలన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే భోజనం చేశారు. తర్వాత బీసీ బాయ్స్ హాస్టల్‌కు వెళ్లి రాత్రి అక్కడే నిద్రించారు. అనంతరం సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ హాస్టల్స్‌కు వెళ్లి విద్యార్థుల సమస్యల్ని తెలుసుకునేందుకు స్వయంగా వెళ్లిన ఆర్కేను అందరూ అభినందిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.