యాప్నగరం

ఎద్దు ఊపిరి తీసిన మామిడికాయ.. గొంతులో ఇరుక్కొని మృతి

మామిడికాయ ఓ ఎద్దు ప్రాణాన్ని బలితీసుకుంది. గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక ఎద్దు మరణించింది. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

Samayam Telugu 30 Apr 2019, 1:01 pm
మామిడికాయ ఓ ఎద్దు ప్రాణాన్ని బలితీసుకుంది. మామిడికాయ గొంతులో ఇరుక్కొని ఎద్దు ప్రాణాలు విడిచిన హృదయ విదారక ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఎద్దును కాపాడుకోవడానికి రైతులు చేసిన ప్రయత్నం వృథా అయింది. భీమారం మండలం కాజీపల్లి గ్రామానికి చెందిన రైతు జంగపెల్లి రామయ్యకు చెందిన ఎద్దు సోమవారం (ఏప్రిల్ 29) సాయంత్రం స్థానికంగా ఉన్న ఓ మామిడి తోటలో మేతకు వెళ్లింది. అక్కడ మేత మేస్తూ.. ఓ మామిడికాయను మింగేసింది. అది కాస్త గొంతు భాగంలో ఇరుక్కోవడంతో విలవిల్లాడింది.
Samayam Telugu ox
ఎద్దు


విషయం గమనించిన రామయ్య.. సమీపంలో ఉన్న మరికొంత మంది రైతులకు సమాచారం ఇచ్చారు. వారంతా కలిసి ఎద్దు గొంతులో ఇరుక్కున్న మామిడికాయను కక్కించేందుకు తీవ్రంగా శ్రమించారు. కానీ, వారి ప్రయత్నం ఫలితాలనివ్వలేదు. ఊపిరిరాడక ఎద్దు దుర్మరణం పాలైంది. దీంతో రైతు రామయ్య కంటతడి పెట్టారు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.