యాప్నగరం

మణిపూర్ సీఎంగా రేపు బిరెన్ ప్రమాణస్వీకారం

మణిపూర్‌లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీకి లైన్ క్లియరైంది.

TNN 14 Mar 2017, 7:27 pm
మణిపూర్‌లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీకి లైన్ క్లియరైంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్‌ నజ్మా హెప్తుల్లా బీజేపీని ఆహ్వానించారు. దీంతో మణిపూర్‌లో మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీకి మార్గం సుగమమైంది. ఈ దిశగా రేపు (మార్చి 15) తొలి అడుగు పడనుంది. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా బిరెన్‌సింగ్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో ఇబోబీ సింగ్ 15 ఏళ్ల పాలనకు తెర పడనుంది. బిరెన్‌తో పాటు మరి కొంత మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తదితరులు హాజరుకానున్నారు.
Samayam Telugu manipur governor invites bjp to form government oath ceremony tomorrow
మణిపూర్ సీఎంగా రేపు బిరెన్ ప్రమాణస్వీకారం


తాజా ఎన్నికల్లో 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్‌లో.. 28 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. బీజేపీ 21 స్థానాల్లో గెలుపొందింది. ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్పష్టమైన మెజారిటీ రాలేదు. దీంతో చిన్న పార్టీల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకువచ్చింది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా బిరెన్‌సింగ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం తమకు మొత్తం 32 మంది సభ్యుల మద్దతు ఉన్నట్లు ఆ పార్టీ గవర్నర్‌కు తెలిపింది. నలుగురు ఎన్‌పీఎఫ్‌, నలుగురు ఎన్‌పీపీ ఎమ్మెల్యేలతో పాటు.. ఎల్‌జీపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ నుంచి ఒక్కో ఎమ్మెల్యే చొప్పున బీజేపీకి మద్దతు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.