యాప్నగరం

‘కల్యాణలక్ష్మి’ఆలస్యం.. పెండింగ్‌లో 83,329 దరఖాస్తులు

2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాల కింద 2,43,785 మంది దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 1,60,456 మందికి మాత్రమే సాయం అందింది.

Samayam Telugu 10 Mar 2019, 10:12 am
నిరుపేద ఆడబిడ్డల వివాహానికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సాయం ఆలస్యమవుతోంది. పేద ఆడపిల్లల పెళ్లి ఖర్చులకు సాయం చేసేందుకు ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబాకర్ పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తులు తనిఖీ చేయాల్సిన అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఇతర పనుల్లో తీరిక లేకుండా ఉండటంతో లబ్ధిదారులకు సరైన సమయంలో సాయం అందడం లేదు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాల కింద 2,43,785 మంది దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 1,60,456 మందికి మాత్రమే సాయం అందింది. ఇంకా 83,329 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
Samayam Telugu Kalyana Lakshmi


పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో ఆర్డీవోల దగ్గర 607 ఉండగా, దరఖాస్తులు పరిశీలన పూర్తయి ఖజానాకు పంపిన దరఖాస్తులు 3,991 ఉన్నాయి. మరో 5,922 దరఖాస్తులను రిజెక్ట్ చేశారు. మిగిలినవి ప్రాసెస్‌లో ఉన్నాయి. ఈ ఏడాది ఎన్నికల నిర్వహణకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నందున దరఖాసుల పరిశీలన వేగంగా జరగడం లేదని అధికారులు చెబుతున్నారు. మరో రెండు మూడు రోజుల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున రెవెన్యూ సిబ్బంది ఎన్నికల విధుల్లో మునిగిపోతారు. దీంతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తుల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

మరోవైపు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటికీ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు ఎలాంటి ఆటంకం ఉండని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ పథకాలు ఇప్పటికే అమలవుతున్నందున లబ్ధిదారులకు సాయం అందడంలో ఎలాంటి జాప్యం జరగకపోవచ్చు. కానీ చెక్కులు మాత్రం ఎమ్మెల్యేలు పంపిణీ చేసే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే చెక్కులు కలెక్టర్లతో పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.