యాప్నగరం

ఉపాధి హామీ కూలీలపై విరిగిపడిన మట్టిపెళ్లలు.. 11 మంది మృతి

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో ఉపాధి హామీ కూలీలపై మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి.

Samayam Telugu 10 Apr 2019, 1:13 pm
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో ఉపాధి హామీ కూలీలపై మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 11 మంది కూలీలు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. చెరువులో మట్టి తవ్వుతుండగా ఒక్కసారిగా పెళ్లలు విరిగిపడ్డాయి. దీంతో కూలీలు వాటి కింద కూరుకుపోయారు. ఘటనాస్థలిలోనే పది మంది మృత్యువాతపడ్డారు. గాయపడిన వారిని తోటి కూలీలు వైద్యం కోసం సమీపంలోని హాస్పిటల్‌కు తరిలించారు. శిథిలాల్లో మరింత మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ఉపాధి హామీ పనులు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులంతా ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో కుటుంబసభ్యులు, బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. దీంతో ఆ ప్రాంతమంతా కూడా విషాదఛాయలు అలుముకున్నాయి.
Samayam Telugu many people died due to clays broken in mahabubnagar
ఉపాధి హామీ కూలీలపై విరిగిపడిన మట్టిపెళ్లలు.. 11 మంది మృతి


ఈ ప్రమాదంలో 12 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. ఇప్పటి వరకు 10 మంది మృతదేహాలను వెలికితీశారు. ఘటనాస్థలికి పోలీసు, రెవెన్యూ అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కూలీలంతా తీలేరు గ్రామస్తులే అని తెలుస్తోంది. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత దురదృష్టకర ఘటనగా పేర్కొన్న ఆయన సహాయక చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

మృతుల్లో మహిళలే అధికంగా ఉన్నారు. ఉపాధి హామీ పనులు చేస్తూ నీడకోసం పక్కనే ఉన్న మట్టి దిబ్బల పక్కకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రోజులుగా వర్షాలు కురవడంతో మట్టి దిబ్బలు నానిపోయి, వారిపై విరిగిపడ్డాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.