ఏవోబీలో మల్కన్గిరి జిల్లాలో 28 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. కాగా ఆ ఘటనలో మావోయిస్టు అగ్రనేత ఆర్.రామకృష్ణ (ఆర్కే)తో పాటూ, కొంతమంది నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విరసం నేత వరవరరావు ఆరోపిస్తున్నారు. వారిని వెంటనే కోర్టు ముందు హాజరుపరచాలని డిమాండ్ చేశారు. ఆర్కేకు ఏం జరిగినా ఆ బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. అయితే ఏపీ డీజీపీ సాంబశివరావు గతంలోనే తమ అదుపులో ఆర్కే లేరని ప్రకటించారు.
నిజానికి ఆర్కే ఏవోబీ ప్రాంతంలోనే ఉంటున్నారన్న పక్కా సమాచారంతోనే గ్రే హౌండ్స్ దళాలు కూంబింగ్ చేపట్టాయి. అయితే ఎన్ కౌంటర్ అనంతరం చనిపోయిన వారిలో ఆర్కే తదితర అగ్రనేతలెవరూ లేరు. విప్లవ సంఘాల నాయకులకూ వారెక్కడున్నారన్న సమాచారం లేదు. దీంతో ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నట్టు పలువురు అనుమానిస్తున్నారు.
నిజానికి ఆర్కే ఏవోబీ ప్రాంతంలోనే ఉంటున్నారన్న పక్కా సమాచారంతోనే గ్రే హౌండ్స్ దళాలు కూంబింగ్ చేపట్టాయి. అయితే ఎన్ కౌంటర్ అనంతరం చనిపోయిన వారిలో ఆర్కే తదితర అగ్రనేతలెవరూ లేరు. విప్లవ సంఘాల నాయకులకూ వారెక్కడున్నారన్న సమాచారం లేదు. దీంతో ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నట్టు పలువురు అనుమానిస్తున్నారు.