యాప్నగరం

ఏపీ ప్రభుత్వానికి మావోల హెచ్చరిక

టీడీపీ నేతలను తరిమికొట్టాలంటూ మావోయిస్టుల లేఖ. మన్యాన్ని ధ్వంసం చేస్తున్నారంటూ ఆరోపణలు.

Samayam Telugu 18 Oct 2018, 12:29 am
వోబీలో కూబింగ్ జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులు ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ లేఖ విడుదల చేశారు. గాలికొండ ఈస్ట్ డివిజన్ ఏరియా కమిటీ కార్యదర్శి గోపీ పేరుతో ఈ లేఖ విడులైంది. చంద్రబాబు మోసపూరిత ప్రకటనలతో మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని, టీడీపీ నేతలకు తరిమి కొట్టాలని రాశారు.
Samayam Telugu Untitled34n


క్వారీల ముసుగులో టీడీపీ నేతలు, బంధువులు మన్యాన్ని ధ్వంసం చేస్తున్నారన్నారు. మన్యంలో లేటరైట్ పేరుతో బాక్సైట్‌ను తరలిస్తున్నారని, గిరిజన సంపదను దోచుకుంటున్నారని తెలిపారు. క్వారీ లీజులను ఆపాలని, గనులను తవ్వుకుపోతున్న నేతలను తరిమికొట్టాలని లేఖలో రాశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.