యాప్నగరం

కాంగ్రెస్ పార్టీకి మరో రాజీనామా..!

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మనవడు, ప్రస్తుత కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి తనయుడు

Samayam Telugu 26 Aug 2018, 5:01 pm
ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మనవడు, ప్రస్తుత కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి తనయుడు ఆదిత్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ను వీడి ఆయన తెలంగాణ జనసమితిలో చేరడం విశేషం. ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలోని పార్టీలోకి చేరిపోయారు మర్రి ఆదిత్య రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి ఈ విధంగా రాజీనామాల పరంపర కొనసాగుతోంది.
Samayam Telugu Marri-Aditya-Reddy


కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర కన్వీనర్ పదవికి మాజీ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే ఇది మరో రాజీనామా. బస్సు యాత్ర నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకున్న మహేశ్ రెడ్డి పార్టీని కూడా వీడతారో లేదో తెలియదు కానీ.. మర్రి శశిధర్ రెడ్డి తనయుడు మాత్రం కాంగ్రెస్‌ను వీడారు. కోదండరాం సమక్షంలో ఈయన తెలంగాణ జనసమితిలోకి చేరారు.

ఆదిత్యతో పాటు పారిశ్రామిక వేత్త బాలలింగం కూడా తెలంగాణ జనసమితిలోకి చేరారు. తనయుడు కాంగ్రెస్‌ను వీడటంపై మర్రి శశిధర్ రెడ్డి ఇంకా స్పందించలేదు. శశిధర్ రెడ్డి అయితే ఇంకా పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు. మర్రి శశిధర్ రెడ్డి మరో తనయుడు పురువారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోనే యాక్టివ్‌గా ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.