యాప్నగరం

భారీ సంఖ్యలో చేపల మృతి

తారమతిపేటలోని అంతమాసం చెరువులో చేపలు అనుమానాస్పద రీతిలో.. భారీ సంఖ్యలో మృత్యువాత పడ్డాయి..

TNN 18 Apr 2017, 12:27 pm
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారమతిపేటలోని అంతమాసం చెరువులో చేపలు అనుమానాస్పద రీతిలో.. భారీ సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. సుమారు రూ. 6 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ నష్టం జరిగిందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. 40 కుటుంబాలు రోడ్డున పడ్డాయని వారు అవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలిస్తున్నారు. చెరువులోని నీటిని, చేపలను పరీక్షల కోసం పంపించారు.
Samayam Telugu mass fish deaths in anthamasam lake of taramatipeta
భారీ సంఖ్యలో చేపల మృతి


మిషన్ కాకతీయ పథకం కింద గతేడాది తెలంగాణలోని చాలా చెరువులను పునరుద్ధరించడం, వర్షాలు కూడా స‌మృద్ధిగా కురవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం పలు చెరువుల్లో పెద్ద సంఖ్యలో చేప పిల్లలను వేయించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.