యాప్నగరం

శంషాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

కూలర్ల కంపెనీలో ఎగసిపడ్డ మంటలు. శంషాబాద్ శివార్లలో భారీ అగ్ని ప్రమాదం.

Samayam Telugu 1 Feb 2019, 7:45 pm
శంషాబాద్‌ మండలం శాతంరాయిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కూలర్లు తయారు చేసే పరిశ్రమలో శుక్రవారం (ఫిబ్రవరి 1) సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో ప్రమాదం తప్పింది.
Samayam Telugu fire


శాతంరాయి శివార్లలోని ఓ రెండంతస్తుల భవనంలో కూలర్లకు సంబంధించిన విడిభాగాలను తయారు చేసే పరిశ్రమ నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఈ భవనంలో షార్క్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగినట్లు పరిశ్రమలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గుర్తించగానే వారంతా.. కిందకు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది.

సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. 4 అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పివేశారు. ప్లాస్టిక్‌ వస్తువులు ఎక్కువగా ఉండటంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.