యాప్నగరం

మేనమామే కాలయముడై.. మానసికంగా ఎదగని కవల చిన్నారుల హత్య

చైతన్యపురిలో దారుణం చోటు చేసుకుంది. మానసికంగా ఎదగని 12 ఏళ్ల కవల చిన్నారులను మేనమామే కిరాతకం హతమార్చాడు.

Samayam Telugu 16 Jun 2018, 8:38 am
హైదరాబాద్‌: చైతన్యపురిలో దారుణం చోటు చేసుకుంది. మానసికంగా ఎదగని 12 ఏళ్ల కవల చిన్నారులను మేనమామే కిరాతకం హతమార్చాడు. సత్యనారాయణపురం కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడకు చెందిన లక్ష్మీ, శ్రీనివాస్ రెడ్డి దంపతులకు 12 ఏళ్ల క్రితం సృజనారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి అనే ఇద్దరు కవలు పిల్లలు జన్మించారు. వీరిద్దరూ మానసికంగా సరిగా ఎదగలేదు. అయినప్పటికీ వారిని తల్లిదండ్రులు జాగ్రత్తగా పెంచారు.
Samayam Telugu twins-killed


చైతన్యపురిలో నివాసం ఉండే మేనమామ మల్లికార్జున రెడ్డి కూడా చిన్నారులంటే ఎంతో ప్రేమ కనబర్చేవాడు. ఈ క్రమంలో చిన్నారులకు ఈత నేర్పిస్తానని చెప్పిన మల్లికార్జున రెడ్డి వారిని హైదరాబాద్ తీసుకొచ్చాడు. శుక్రవారం రాత్రి సమయంలో అభం శుభం తెలియని ఆ చిన్నారులను హత్య చేశాడు.

కారు డిక్కీలో శవాలను వేసి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా.. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హత్యోందంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా.. వారు ఉదయంలోగా హైదరాబాద్ చేరుకున్నారు. చిన్నారుల హత్యతో విషాదంలో మునిగిపోయిన తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. నిందితుడు మల్లికార్జున రెడ్డితోపాటు మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. మానసికంగా ఎదగలేదనే కారణంతోనే చంపేశారని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.