యాప్నగరం

తెలంగాణలో మెగా డిఎస్సీ: ఎంపీ సుమన్

తెలంగాణలో త్వరలో డీఎస్సీ నోటిఫేకేషన్ విడుదల అవుతుందని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ వెల్లడించారు.

TNN 3 May 2017, 5:52 pm
తెలంగాణలో త్వరలో డీఎస్సీ నోటిఫేకేషన్ విడుదల అవుతుందని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ వెల్లడించారు. పలువురు విద్యార్థి నాయకులతో కలసి బుధవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిసిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు 8792 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గతంలో సీఎం కేసీఆర్ తమకు చెప్పారని సుమన్ అన్నారు. వీటినే వెంటనే భర్తీ చేయాలని కూడా సీఎం ఆదేశించారన్నారు. ఈ పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఈరోజు ఉప ముఖ్యమంత్రిని కోరినట్లు సుమన్ చెప్పారు. ఈ మేరకు మరో 15 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తమకు కడియం హామీ ఇచ్చారని చెప్పారు.
Samayam Telugu mega dsc notification in telangana soon says trs mp balka suman
తెలంగాణలో మెగా డిఎస్సీ: ఎంపీ సుమన్


అలాగే జూనియర్, డిగ్రీ కాలేజీల లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు కడియం చెప్పారని సుమన్ వెల్లడించారు. అలాగే గురుకులాల్లో పీఈటీ పోస్టుల భర్తీ అర్హతలను సడలించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై సుప్రీం కోర్టులో ప్రభుత్వం త్వరలోనే స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేస్తుందని సుమన్ చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగుల విషయంలో సీఎం కేసీఆర్ పూర్తి సానుకూలంగా ఉన్నారని, ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టించే మాటలు నమ్మవద్దని ఆయన నిరుద్యోగులకు సూచించారు. కాగా, ఉప ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి, బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయ గౌడ్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.