యాప్నగరం

మెగాస్టార్ మనసు గెలిచిన ఆటోవాలా పోలీస్‌గా ఎంపిక

మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో పాల్గొని చిరంజీవితోపాటు తెలుగు వారి మనసులు గెలుపొందిన ఆటో డ్రైవర్ సతీష్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు.

TNN 19 Feb 2017, 3:59 pm
మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో పాల్గొని చిరంజీవితోపాటు తెలుగు వారి మనసులు గెలుపొందిన ఆటో డ్రైవర్ సతీష్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. తన ప్రతిభ ద్వారా షోలో రూ. 1.6 లక్షలు గెల్చుకున్న సతీష్... నిజాయతీ, అంకితభావం, కుటుంబం పట్ల తనకున్న శ్రద్ధతో మెగాస్టార్ మనుసు గెలుచుకున్నాడు. అతడి కష్టాలను చూసి చలించిన చిరు.. వ్యక్తిగతంగా రూ. 2 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించి ఎంకరేజ్ చేశారు. ఇంటర్ చదివి ఆటో నడుపుతున్న సతీష్.. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణుడయ్యాడు.
Samayam Telugu mek autowala who impressed chiranjeevi selected as police constable
మెగాస్టార్ మనసు గెలిచిన ఆటోవాలా పోలీస్‌గా ఎంపిక


మేడ్చల్‌ మండలం పూడూర్‌ గ్రావూనికి చెందిన సతీష్ పేపర్‌ బాయ్‌గా, చిట్‌ ఫండ్స్‌లో కలెక్షన్‌ బాయ్‌గా పనిచేస్తూ పదో తరగతి పూర్తి చేశాడు. తండ్రి అనారోగ్యానికి గురికావడం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆటో డ్రైవర్‌గా జీవితాన్ని ఆరంభించాడు. ఆటో నడుపుతూ ఇంటర్‌ పూర్తి చేశాడు. చెల్లి పెళ్లి చేయడం, తండ్రి మరణంతో కుటుంబ భారం అతడిపై పడింది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లోనే పోలీస్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్న సతీష్‌కు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. షోలో చిరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి రూ.1.60 లక్షలు గెలుచుకున్నాడు. చిరంజీవి మరో రూ.2 లక్షలు అందజేశారు. అంతే కాకుండా అతడి కోరిక మేరకు ఆటో ఎక్కిన చిరు తన సరదా కూడా తీర్చుకున్నారు.

ఆటో ఎక్కిన సందర్భంగా చిరంజీవి సతీష్‌కు ఆటో డ్రైవర్ యూనిఫాం బహుకరించారు. సతీష్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. మరి మెగాస్టార్ ఇప్పుడు పోలీస్ యూనిఫాంను సతీష్‌కు బహుకరిస్తాడా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.