యాప్నగరం

మెడకు ఉరేసుకొని.. సెల్ఫీ వీడియో

వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక పాతబస్తీలో ఓ చిరువ్యాపారి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అతడు తన మెడకు తాడు బిగించుకొని సెల్‌ఫోన్లో రికార్డు చేసిన మరణ వాంగ్మూలం వీడియో పలువురుని కంటతడి పెట్టిస్తోంది. రాజేంద్రనగర్‌ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి మొఘల్‌కాలనీకి చెందిన షాహీద్‌ హుస్సేన్‌ పాతబస్తీలోని జుమేరాత్‌ బజార్లో వ్యాపారం చేస్తున్నాడు.

TNN 12 Oct 2017, 9:17 pm
వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక పాతబస్తీలో ఓ చిరువ్యాపారి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అతడు తన మెడకు తాడు బిగించుకొని సెల్‌ఫోన్లో రికార్డు చేసిన మరణ వాంగ్మూలం వీడియో పలువురుని కంటతడి పెట్టిస్తోంది. రాజేంద్రనగర్‌ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి మొఘల్‌కాలనీకి చెందిన షాహీద్‌ హుస్సేన్‌ పాతబస్తీలోని జుమేరాత్‌ బజార్లో వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం కోసం ఐదుగురు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి రూ. 9 లక్షలు అప్పు చేశాడు. కానీ, ఆశించిన మేర అమ్మకాలు లేకపోవడంతో అతడు నష్టాల పాలయ్యాడు. ఇదే సమయంలో షాహీద్‌కు వడ్డీ వ్యాపారుల నుంచి వేధింపులు ఎక్కువ అయ్యామి. అప్పు తీర్చలేక, వేధింపులు తాళలేక దుకాణంలో షట్టర్ మూసేసుకొని ఉరేసుకున్నాడు.
Samayam Telugu merchant hangs himself in hyderabad due to money lenders harrasment
మెడకు ఉరేసుకొని.. సెల్ఫీ వీడియో


విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే దుకాణం తలుపులు పగలగొట్టి అతణ్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై షాహిద్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాహీద్‌ సెల్ఫీ వీడియోలోని వివరాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.