యాప్నగరం

జూన్ నెలాఖరుకు అమీర్‌పేట-ఎల్బీనగర్ రూట్ పూర్తి: మెట్రో ఎండీ

అమీర్‌పేట టు ఎల్బీనగర్‌ మెట్రో లైన్‌పై క్లారిటీ ఇచ్చారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఉబెర్-మెట్రోల మధ్య జరిగిన ఒప్పంద కార్యక్రమానికి హాజరైన ఆయన... మెట్రో పనుల పురోగతిపై స్పందించారు.

Samayam Telugu 19 Apr 2018, 6:13 pm
అమీర్‌పేట టు ఎల్బీనగర్‌ మెట్రో లైన్‌పై క్లారిటీ ఇచ్చారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఉబెర్-మెట్రోల మధ్య జరిగిన ఒప్పంద కార్యక్రమానికి హాజరైన ఆయన... మెట్రో పనుల పురోగతిపై స్పందించారు. జూన్ చివరి నాటికి ఈ రూట్‌లో పనులు పూర్తి పూర్తవుతుందని... ప్రారంభంపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రెండో దశ పనులపై సీఎం కేసీఆర్ తమతో చర్చించారని... శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో లైన్‌ను పొడిగించాలని ఆయన భావిస్తున్నట్లు చెప్పారు.
Samayam Telugu Metro Md


కమ్యూనికేషన్ బేస్‌డ్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ వినియోగించడం దేశంలోని తొలిసారని... ఈ సీబీటీసీ పరిజ్ఞానం వల్లే మెట్రో పూర్తి చేయడంలో ఆలస్యం జరుగుతుందన్నారు. హైటెక్ సిటీ వరకు మెట్రో లైన్ కోసం భూమి సేకరణ జరుగుతుందని చెప్పారు. ఆ లైన్‌లో కూడా పనుల్ని మరింత వేగవంతం చేస్తామన్నారు ఎన్వీఎస్ రెడ్డి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.