యాప్నగరం

భాగ్యనగరానికి మరో అగ్రశ్రేణి కంపెనీ

ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలు కొలువు దీరుతున్న భాగ్యనగరంలో మరో అగ్రశ్రేణి సంస్థ ఏర్పాటు కానుంది. సెమీకండక్టర్ల తయారీలో టాప్ కంపెనీగా పేరొందిన మైక్రాన్ టెక్నాలజీ హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది.

Samayam Telugu 17 Sep 2018, 7:39 pm
సెమీకండక్టర్ల తయారీలో అగ్రశ్రేణి సంస్థగా పేరొందిన మైక్రాన్ టెక్నాలజీ హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. రూ.300 కోట్ల వ్యయంతో భాగ్యనగరంలో ఆ సంస్థను ఏర్పాటు కాబోతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కార్యకలాపాల నిర్వహణకు మైక్రాన్‌కు మాదాపూర్‌లోని ఐటీ హబ్‌లో 1.8 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సంస్థ ఏర్పాటు వల్ల భవిష్యత్తులో సుమారు వెయ్యి ఇంజినీరింగ్, ఐటీ ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు.
Samayam Telugu MICRON


51 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఉన్న మైక్రాన్ టెక్నాలజీ.. ఇప్పటికే సింగపూర్, మలేసియా, తైవాన్, జపాన్, చైనాల్లో కార్యకలాపాలు చేపడుతోంది. మనదేశంలో హైదరాబాద్ కేంద్రంగా ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహించనుంది. మైక్రాన్ సీనియర్ డైరెక్టర్ స్టీఫెన్ డ్రేక్, డైరెక్టర్ అమరీందర్ సిదూలతో కూడిన ప్రతినిధి బృందం సోమవారం మంత్రి కేటీఆర్‌తో సమావేశమైంది.
కంపెనీకి అవసరమైన సిబ్బంది ఎంపిక, శిక్షణకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్- టాస్క్‌తో కలిసి పని చేస్తామని ప్రతినిధుల బృందం కేటీఆర్‌కు తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.