యాప్నగరం

ఎంఐఎంను ఒంటరిగా ఢీకొనలేకే పొత్తు.. ఆత్మగౌరవం ఏమైంది: అసదుద్దీన్

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ.. ఆ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటుందని అసదుద్దీన్ ప్రశ్నించారు. తెలుగువారి ఆత్మగౌరవం ఎక్కడ పోయిందని అన్నారు.

Samayam Telugu 8 Sep 2018, 11:52 pm
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకోవడానికి మొగ్గు చూపుతున్న వేళ విమర్శల దాడి పెరుగుతోంది. ఇప్పటికే ఈ అంశంపై వైఎస్సార్‌సీపీ, బీజేపీ నేతలు చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేయగా.. తాజాగా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ.. ఆ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటుందని ఆయన ప్రశ్నించారు. తెలుగువారి ఆత్మగౌరవం ఎక్కడ పోయిందని అన్నారు. శనివారం (సెప్టెంబర్ 8) ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు.
Samayam Telugu asad


టీడీపీ, కాంగ్రెస్ పొత్తును ప్రజలు తిప్పికొడతారని అసదుద్దీన్ అన్నారు. ఏపీ సీఎంగా నాలుగేళ్లు ఏం చేయని చంద్రబాబు తెలంగాణకు వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. పొత్తుతో కాంగ్రెస్, టీడీపీ నిండా మునుగుతాయని పేర్కొన్నారు.

పనిలో పనిగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అసదుద్దీన్ ప్రశంసలు కురిపించారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ పూర్తి మెజార్టీతో గెలుస్తుందని, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని జోస్యం చెప్పారు. పదవులపై తమకు ఎప్పుడూ ఆశ లేదన్న ఓవైసీ.. మైనార్టీలు, బలహీనవర్గాల కోసం తమ పార్టీ పాటుపడుతుందని అన్నారు.

‘తన పాలనపై ఎంతో విశ్వాసం ఉండటం వల్లే టీఆర్‌ఎస్ పదవీ కాలం ముగియకున్నా.. కేసీఆర్ ఎన్నికలకు సిద్ధమయ్యారు. మరే ఇతర రాజకీయ పార్టీలు చేయని సాహసం చేశారు. కేసీఆర్ పాపులారిటీ చాలా ఎక్కువగా ఉంది. టీఆర్‌ఎస్, ఎంఐఎంను ఒంటరిగా ఢీకొనే దమ్ములేక పొత్తుల కోసం పాకులాడుతున్నారు’ అని అసదుద్దీన్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.